Politics

వచ్చే ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు జోస్యం

వచ్చే ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు జోస్యం

వైకాపా ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విషయం సీఎంకు అర్థమైందని.. ఓటమి భయం జగన్‌ను వెంటాడుతోందని విమర్శించారు. మే లేదా అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా.. అనే ఆలోచనలో పడ్డారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు.