Business

రైల్వేలో వయోవృద్ధుల రాయితీ లేనట్లే!

రైల్వేలో వయోవృద్ధుల రాయితీ లేనట్లే!

రైళ్లలో సీనియర్‌ సిటిజన్లకు రాయితీ (Senior citizens concessions) ఇప్పట్లో లేనట్లేనని కేంద్రం స్పష్టంచేసింది. ఇప్పటికిప్పుడు రాయితీని పునరుద్ధరించే అవకాశం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) పార్లమెంట్‌కు తెలియజేశారు. రైల్వేలో (Indian Railway) పెన్షన్లు, వేతనాలు ఇప్పటికే అధికంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో సీనియర్లకు రాయతీని పునరుద్ధరించడం ఇప్పట్లో వీలుకాదని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్‌ రాణా అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో ఈ మేరకు ఆయన బుధవారం సమాధానం ఇచ్చారు. కరోనా సమయం నుంచి ఈ రాయితీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.