Devotional

TNI ఆధ్యాత్మికం …శ్రీవారికి భారీ విరాళం అందించిన టిటిడి చైర్మన్

TNI ఆధ్యాత్మికం …శ్రీవారికి భారీ విరాళం అందించిన టిటిడి చైర్మన్

“శ్రీ వారికి 2కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారు కంఠా భరణం కానుకగా సమర్పించిన టీటీడీ చైర్మన్ గారి దంపతులు.”

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి దంపతులు ఆదివారం 2కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాముల శ్రీదేవి సమేత బంగారు కంఠాభరణాన్ని కానుకగా సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ కు చైర్మన్ దంపతులు ఈ ఆభరణం అందించారు.
ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలనే స్వామివారికి కానుక: టీటీడీ చైర్మన్ గారి దంపతులు

విశ్వ శాంతి కోసం తిరుమల ధర్మగిరి వేద విద్యాపీఠం లో ఈ నెల 12నుండి 18వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహా యాగం ఆదివారం మహా పూర్ణాహుతితో విజయవంతంగా ముగిసిందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, శ్రీమతి స్వరలత గారు ఆనందం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మన దేశంపై కరోనా ప్రభావం ఉండకూడదని, ప్రపంచంలోని ప్రజలే కాకుండా సకల జీవులు ఆరోగ్యాంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ యాగం నిర్వహించామన్నారు. తిరుమలలో ఇప్పటి దాకా జరగని ఇలాంటి యాగం స్వామి వారి ఆశీస్సులతో తాము చేయించడం అదృష్టమని వారు చెప్పారు.
శ్రీ శ్రీనివాస మహా విశ్వ శాంతి యాగం విజయవంతంగా ముగిసినందువల్ల స్వామి వారికి కానుక సమర్పించామని చెప్పారు.