Devotional

శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం .

శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం .

తిరుమల శ్రీవారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయక మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియంగార్లు గోష్టిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీవైష్ణువు పారాయణం చేస్తారు. కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరాత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామికి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.