Politics

షార్జాలో ప్రవాస తెలుగు వారి క్రిస్మస్ వేడుకలు.

షార్జాలో ప్రవాస తెలుగు వారి క్రిస్మస్ వేడుకలు.

0df85ddd-0cf6-4135-b81e-9cf323385bba
ప్రభువును ఆరాధించడానికి అర్భాటం అవసరం లేదు. ఎడారి అయినా గోదావరి తీరాన లంక గ్రామమైనా ఎక్కడైనా నిండు మనస్సుతో ఆయన నామాన్ని స్మరించుకొంటూ భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే చాలు. అదే విధంగా సంతోషంగా పండుగ జరుపుకోవడానికి ఫలాన అంటూ ఒక ప్రదేశం అవసరం లేదు, అది పాలకొల్లు కావచ్చు లేదా షార్జా కావచ్చు.

షార్జా ఏమిరేట్ లో నివాసముంటున్న తెలుగు క్రైస్తవ ప్రవాసీయులు తమ ఏమిరేట్ లోనె క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకోంటున్నారు. యార్మోక్ ప్రాంతంలో ఉన్న షార్జా వర్షిప్ సెంటర్ మరియు సెంట్ మార్టిన్ చర్చిలలో తెలుగు ప్రవాసీయులు క్రిస్మస్ ఉత్సవాలను శని,ఆదివారాలలో ఘనంగా జరుపుకోన్నారు. షార్జాలోని తెలుగు చర్చి అయిన రూపాంతర క్రైస్తవ సంఘం అధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ ఉత్సవానికి అర్చబిషప్ డాక్టర్ రాజబాబు విశాఖపట్టణం నుండి ప్రత్యెకంగా వచ్చి ముఖ్య అతిథిగా పాల్గోని వాక్యాన్ని వినిపించారు. ప్రొగ్రెసివ్ ఇంగ్లీష్ స్కూల్ డెరెక్టర్ సమా, యస్. ఎ. సమ్యూల్ లు విశిష్ఠ అతిథులుగా పాల్గోన్నారు. ఎలిం చర్చి (పాస్టర్ దినేష్), తెలుగు క్రైస్తవ సహవాసం (పాస్టర్ ఫ్రాన్సిస్), గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ (సిస్టర్ షారోన్), గోస్పెల్ గ్రేస్ మినిస్ట్రీస్ (పాస్టర్ రమణ బాబు) జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ (పాస్టర్ రమణ బాబు), రక్షణ సువార్త సంఘం ( పాస్టర్ జోషి కాటిక) మరియు ఇతర పాస్టర్లు క్రీస్తు కుమారు, సుబ్బారావు, జేమ్స్ లు పాల్గోన్నారు. వైద్య చికిత్స అనంతరం కొన్నాళ్ళు ఆంధ్రలో ఉండి వచ్చిన సీనియర్ పాస్టర్ అయిన భాగ్యనందం గుడాలను అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర అధ్యాత్మిక సేవలు జరిగినట్లుగా నిర్వహాకులు తెలిపారు. అయిదవ తరగతి విద్యార్ధిని, పాలకొల్లుకు చెందిన ప్రవాసీయులు ప్రభాకర్ రావు – అరుణల కూతరు డెలీనా పాటల పోటీలో ప్రధమ బహుమతి అందుకొంది.