Politics

రోజుకు 10కిమీ నడవనున్న లోకేష్

రోజుకు 10కిమీ నడవనున్న లోకేష్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాదయాత్రకు ‘యువగళం’ పేరును నిర్ణయించారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల 27 నుంచి లోకేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. మొత్తం 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.