NRI-NRT

మహబూబాబాద్‌లో తానా ఆదరణ కార్యక్రమం

మహబూబాబాద్‌లో తానా ఆదరణ కార్యక్రమం

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గోపాలపురం ఉన్నత పాఠశాలలో 13మంది బాలికలకు తానా ఆదరణ కార్యక్రమంలో భాగంగా 13మంది విద్యార్థినులకు సైకిళ్ళను తానా ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ అందజేశారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి డొంక రోడ్లపై నడిచి వస్తున్న ఆడపిల్లలకు ఈ వితరణ లబ్ధి చేకూర్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. దాత రవి సామినేనికి, తానాకు ధన్యవాదాలు తెలిపారు.