Movies

‘అన్​స్టాపబుల్​’ కోసం కోర్టుకు ‘ఆహా’.. తక్షణమే ఆపాలని హైకోర్టు ఆర్డర్

‘అన్​స్టాపబుల్​’ కోసం కోర్టుకు ‘ఆహా’.. తక్షణమే ఆపాలని హైకోర్టు ఆర్డర్

‘అన్​స్టాపబుల్ 2’ షో పైరసీపై ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ ‘ఆహా’ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పైరసీని నిలువరించేందుకు జాండో ఆర్డర్​ను తీసుకుంది. ఈ మేరకు ‘ఆహా’ ప్రతినిధులు ఓ సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆహా యాప్ లో వస్తోన్న ‘అన్​స్టాపబుల్ 2’ కంటెంట్ పైరసీకి గురవుతోందని.. దానిని నిలువరించేందుకు కోర్టు నుంచి జాండో ఆర్డర్ తీసుకున్నట్టు ఆహా ప్రతినిధులు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ‘ఆహా’ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్, లీగల్ టీం సభ్యుడు ఆశిష్ ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా.. దేశంలోనే మొట్టమొదటి సారిగా దిల్లీ హైకోర్టు నుంచి జాండో ఆర్డర్ పొందినట్టు ఆశిష్ తెలిపారు. దీని ప్రకారం అన్​స్టాపబుల్ కంటెంట్ పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు. జాండో ఆర్డర్​తో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసి.. వారి ద్వారా పైరసీ చేసే వారిపై చర్యలు తీసుకోనుందని అన్నారు. ఆయా వెబ్ సైట్లను బ్యాన్ చేయటం సహా మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.