Politics

పవన్ కు వరుసగా దూరం అవుతున్న నేతలు !!

పవన్ కు వరుసగా దూరం అవుతున్న నేతలు !!

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు తొలి నుంచి మెగా బ్రదర్స్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రజారాజ్యం కార్యాలయం కూడా ఆయనే ఇచ్చింది. ప్రజారాజ్యం నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసి 2009లో ఓడిపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తరువాత కోర్ నేతలుగా వ్యవహరించిన వారంతా చిరంజీవికి దూరమయ్యారు. కాంగ్రెస్ లో చేరలేక..ఎవరి దారి వారు చూసుకున్నారు. 2014 ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసినా.. పరాజయం పాలయ్యారు. ఇక, జనసేనాని పవన్ తో ఉన్న సంబంధాలతో ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. కానీ, గెలవలేదు. ఎన్నికల్లో గెలవకపోయినా.. పవన్ కల్యాణ్ ను సన్నిహితుడుగా జనసేన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన తోట చంద్రశేఖర్ తో సహా వరుసగా నేతలు పార్టీకి దూరం కావటం చర్చనీయాశంగా మారుతోంది.