Fashion

జెద్ధాలో నూతన సంవత్సర వేడుకలు

జెద్ధాలో నూతన సంవత్సర  వేడుకలు

2

వివిధ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రవాసీయులు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలను విభిన్న రీతిలో ఆనందోత్సవాల మధ్య ఉల్లాసంగా మరియు అధ్యాత్మికంగా నిర్వహించుకోన్నారు. సౌదీ అరేబియా వాణిజ్య రాజధాని జెద్ధా నగరంలోని తెలుగు ప్రవాసీ కుటుంబాలు కూడ ఈ వేడుకలను తమదైన శైలీలో నిర్వహించుకోన్నారు.

క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్ధమని, ఆ ఆరాధన హృదయాంతరాళాల నుండి పెల్లుబక్కాలని క్రైస్తవ పెద్దలు ఈ సందర్భంగా సందేశమిచ్చారు. సత్య వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిను పులకరింపచేసిన సమయమదని వక్తలు పెర్కోన్నారు. నలదం చర్చి పాస్టర్ సిమ్సన్, ఇమ్యూనల్, జాన్, మమత, సైమన్ పీటర్,చరిత్ర, సుదీప్, నవీన్, ప్రదీప్ నానీ తదితరులు సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది కూడ పాల్గోన్నారు. చిన్నారులకు రూత్ క్విజ్ పోటీలను నిర్వహించగా ఇతర సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను కూడ నిర్వహించారు.

జెద్ధాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన జె.టి.యం మరియు స్ధానిక తెలుగుదేశం పార్టీ నాయకురాలు గాలి దుర్గా భవానీ, వర్ష ఇతరలు కూడ కార్యక్రమంలో పాల్గోని నూతన సంవత్సర శుభకాంక్షలు తెలియజేసారు.

3