NRI-NRT

లోకేష్ ను కలిసిన ఆస్ట్రేలియా ప్రవాసులు

లోకేష్ ను కలిసిన ఆస్ట్రేలియా  ప్రవాసులు

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మంత్రి నారా లోకేష్ ని ఈరోజు మెల్బోర్న్ కి చెందిన ఎన్నారైల బృందం కలుసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు గురించి లోకేష్ తో చర్చించారు. ఎన్నారైలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి తమ వంతు కృషి చేస్తాం అని వారు లోకేష్ కి తెలియచేసారు అలానే త్వరలో మొదలవ్వబోయే లోకేష్ పాదయాత్ర విజయవంతం అవాలని వారు ఆకాంక్షిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ భేటీలో విక్టోరియా స్టేట్ తెలుగుదేశం ప్రెసిడెంట్ దేవేంద్ర పర్వతనేని, మరియు సభ్యులు బలుసు కిషోర్ అలానే గుంటూరు జిల్లా నాయకురాలు యడ్లపల్లి వాణి తదితరులు పాల్గొన్నారు .