DailyDose

TNI నేటి నేర వార్తలు..హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

TNI నేటి నేర వార్తలు..హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

180 గ్రాముల కొకైను ని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు.

బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్న నైజీరియన్ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు.

హైదరాబాదులో సప్లై చేస్తుండగా రెడ్ అయినా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు

ఎక్సైజ్ అధికారుల చరిత్రలో భారీ మొత్తంలో కోకాయం పట్టివేత
*********************
జంట నగరాల్లో రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్

గంటల వ్యవధిలోని ఆరు చోట్ల స్నాచింగ్ పాల్పడ్డ దొంగలు.

హైదరాబాద్ రాచకొండ పరిధిలో ఆరు చోట్ల స్నాచింగ్లు

ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్లు..

స్నాచర్స్ ను పట్టుకోవడానికి రంగంలో దిగిన పోలీస్ బృందాలు.

హైదరాబాదులోని అన్నిచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
*******************
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ లు, రిజిస్టర్ కాని ఫిర్యాదులు వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

హోమ్ శాఖకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర హైకోర్టు

చట్టపరంగా తనకున్న హక్కులను ఉపయోగించుకునేందుకు రఘురామకృష్ణరాజుకు అవకాశం ఉందని పేర్కొన్న హైకోర్టు

తన పై ఉన్న కేసుల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే డీజీపీకి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

వివరాలు ఇవ్వకపోవడంతో హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటీషన్

పిటీషన్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఉమేష్‌ చంద్ర

నియోజకవర్గానికి వచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాదించిన ఉమేష్‌చంద్ర

ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన హోమ్‌ శాఖ న్యాయవాది

ఉమేష్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు

రఘురామకృష్ణరాజు పై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లు, రిజిస్టర్ కాకుండా ఉన్న వివరాలు కూడా వెంటనే కాపు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాద్ రాయ్ ఆదేశాలు

కేసు విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా*
67

***************************
బాలకృష్ణ హెలికాప్టర్లో సాంకేతిక లోపం

నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంగోలు నుంచి హైదరాబాద్ కు విమానం బయల్దేరగా.. కాసేపటికే లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించి, తిరిగి మళ్లీ ఒంగోలులో సేఫ్ ల్యాండ్ చేశాడు. ఈ లోపాన్ని సవరించేందుకు టెక్నీషియన్స్ ప్రయత్నిస్తుండగా.. రిపేర్ కాకపోతే రోడ్డు మార్గాన బాలయ్య హైదరాబాద్ కు వెళ్లే అవకాశం ఉంది.
**************************
ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లాలో ముగ్గురు VROల సస్పెండ్.. తహసీల్దార్లకు షో కాజ్

భూ పత్రాల పంపిణీ, రీసర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు వీఆర్వోలను కలెక్టర్ దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు.

అర్ధవీడు (మం) దొనకొండ VRO ఆంజనేయులు, పామూరు (మం) లక్ష్మీనర్సాపురం VRO ఖాసింవలి, మర్రిపూడి (మం) గార్లపేట VRO రవిలు సస్పెండ్ అయ్యారు.

అలాగే చీమకుర్తి, సీఎసపురం, హనుమంతునిపాడు, పామూరు, అర్ధవీడు మండలాల తహసీల్దార్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
******************************
వైసీపీ ఎంపీటీసీ ఇంట్లో కిలోలకొద్దీ గంజాయి స్వాధీనం

బాపట్ల: గంజాయి అక్రమ రవాణా కేసులో కదులుతున్న డొంక

గంజాయి కేసులో వైసీపీ ఎంపీటీసీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

చినగంజాం మండలం మోటుపల్లిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

గతనెల సూర్యలంకలో గంజాయి కేసుకు సంబంధించి విచారణ

వైసీపీ ఎంపీటీసీ ఇంట్లో కిలోలకొద్దీ గంజాయి స్వాధీనం

బాపట్ల గ్రామీణ పోలీసుల అదుపులో వైసీపీ ఎంపీటీసీ

గంజాయి కేసు నుంచి ఎంపీటీసీని తప్పించేందుకు వైసీపీ నేతల ఒత్తిడి
********************************
Qఅనంతపురం:

అక్రమ ఆయుధాల కేసులో పట్టుబడిన నిందితులకు ముగిసిన 7 రోజుల పోలీసు కస్టడీ.

* నిందితుల విచారణలో పలు కీలక విషయాలు రాబట్టిన అనంతపురం పోలీసులు.

* ఈ ముఠాకు చెందిన ఆరుగురి సభ్యులపై డి.హీరేహాళ్ పోలీసు స్టేషన్లో క్రైం నంబర్ 120/22 u/sec 120(b) r/w 34 ipc, sec 8(c) 20(b)(ii)(B)(c) of NDPS act 1985 & sec 25 (1 B) (a) rrms act 1959 గా కేసు 25-12-2022 తేదీన నమోదు చేయడమైనది

* ఈ కేసులో నిందితులైన కర్నాటక రాష్ట్రానికి చెందిన జంషీద్, ముబారక్, అమీర్ పాషా మరియు గోవా కు చెందిన రియాజ్ షేక్, మధ్యప్రదేశ్ కు చెందిన రాజ్ పాల్ సింగ్ జునేజా @ చోటు మరియు చూన్నిలాల్ @ నన్ను సుతార్ ఆదివాసీ లను గౌరవ మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి గారు 31-12-22 తేది నుండి 07-01-23 వరకు పోలీసు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు

* ఇందులో భాగంగా 31-12-2022 తేది నుండి 07-01-23 తేదీ వరకు నిందితులను పోలీసు కస్టడీ తీసుకుని దర్యాప్తు కొనసాగించిన పోలీసులు

* కేసు దర్యాప్తులో భాగంగా కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు గోవా రాష్ట్రాలలో పలు ప్రదేశాలలో సందర్శించి సాక్ష్యాలు సేకరించిన పోలీసులు.

* మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బర్వాణి జిల్లా, వర్ల త
****************************
నెల్లూరు జిల్లా..

బుచ్చిరెడ్డిపాలెం తాసిల్దార్ ప్రమీలపై సస్పెన్షన్ వేటు..

రీ-సర్వేలో తన పొలాన్ని వేరొకరి పేరు మీద మార్చడంపై స్పందనలో ఫిర్యాదు చేసిన ఓ రైతు..

విచారణ అనంతరం సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్..
**********************