Politics

మా ఇద్దరి ఉమ్మడి శత్రువు జగనే. బాబు.. పీకే ప్రకటన…

మా ఇద్దరి ఉమ్మడి శత్రువు జగనే. బాబు.. పీకే ప్రకటన…

వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లోని బాబు నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా ఇద్దరు చర్చించుకున్నారు.

ఆ తర్వాత ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. పెన్షన్లు తీసేయడం, రైతులు, ప్రజల సమస్యలపై చర్చించామని తెలిపారు.

బ్రిటీష్ కాలం నాటి జీవోతో ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. వైజాగ్ లో తనను అడ్డుకున్నారని.. కుప్పంలో చంద్రబాబును కూడా అలాగే అడ్డుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దుర్మార్గమన్న పవన్.. జీవో నెంబర్ 1 పై ఎలా పోరాడాలనే అంశంపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు.

ఇక చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటంలో పవన్ ను అడ్డుకున్నారని.. ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. అలాతే తాను ఎక్కడికి పోయినా అడ్డుపడుతున్నారని ఫైరయ్యారు. గంజాయి, మాదకద్రవ్యాలపై పోరాడితే తమ ఆఫీస్ పై దాడి చే