Sports

ఆటా లో ముగిసిన ఎన్నికల పోరు.. గెలిసిన అభ్యర్థులు వీరే..

ఆటా ముగిసిన ఎన్నికల పోరు.. గెలిసిన అభ్యర్థులు వీరే..

అమెరికా తెలుగు సంఘం (ఆటా) 2023-26 కాలానికి జరిగిన ఎన్నికల్లో లైఫ్‌ కేటగిరీలో 10, ప్యాట్రన్‌ కేటగిరీలో 3 మరియు గ్రాండ్‌ ప్యాట్రన్‌ కేటగిరీలో 3 కలిపి మొత్తం 16 బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్‌ కమిటీ 2022 డిసెంబర్‌ 15న ఆటా సభ్యులందరికీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్స్‌ పోస్ట్‌ చేసింది. వోట్‌ వేసిన వారు ప్రీపెయిడ్‌ ఎన్వలప్‌ ద్వారా 2023 జనవరి 6 లోపు తిరిగి పంపించారు. లైఫ్‌ కేటగిరీలో 10 కి 10 స్లేట్‌ అభ్యర్థులు గెలుపొందగా, ప్యాట్రన్‌ మరియు గ్రాండ్‌ ప్యాట్రన్‌ కేటగిరీలలో మిక్స్డ్‌ స్లేట్‌ అభ్యర్థులు గెలుపొందారు. జనవరి 21న లాస్‌ వెగాస్‌లో నిర్వహించే ఆటా బోర్డు మీటింగ్లో ఆటా తదుపరి అధ్యక్షుని ఎన్నుకుంటారు.

ఎన్నికైన అభ్యర్థులు:

లైఫ్‌ క్యాటగిరిలో
అనిల్‌ బొద్దిరెడ్డి, సన్నిరెడ్డి, కిరణ్‌ పాశం, కిషోర్‌ గూడూరు, మహీధర్‌ ముసుకల, నర్సిరెడ్డి గడ్డికొప్పుల, రామకృష్ణారెడ్డి అల, రాజు కక్కెర్ల, సాయి సుధిని, శ్రీకాంత్‌ గుడిపాటి ఎన్నికయ్యారు.

ప్యాట్రన్‌ క్యాటగిరీ
నరసింహ ధ్యాసాని, రఘువీర్‌ మరిపెద్ది, సాయినాథ్‌ బోయపల్లి

గ్రాండ్‌ ప్యాట్రన్‌ క్యాటగిరీ
సతీష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ దర్గుల, వినోద్‌ రెడ్డి ఎన్నికయ్యారు.