అమరావతి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ పక్ష ఉపనేత, కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
టిడిపి సోషల్ మీడియా సలహాదారులుగా పయ్యావుల కేశవ్, జివి రెడ్డి
★ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం సలహాదారులుగా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనసభ్యులు, పయ్యావుల కేశవ్, జాతీయ అధికార ప్రతినిధి జివి రెడ్డిని నియమించడం జరిగింది.
★ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐటిడిపి కన్వీనర్ చింతకాయల విజయ్, సోషల్ మీడియా సలహాదారులు పయ్యావుల కేశవ్, జివి రెడ్డిలు వైసిపి ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజాసమస్యలపై సోషల్ మీడియాను బలోపేతం చేసేందుకు కృషిచేయడం జరుగుతుంది.