DailyDose

చివరి నిజాం నవాబు ముకర్రం జా కన్నుమూత

చివరి నిజాం నవాబు ముకర్రం జా కన్నుమూత

చివరి నిజాం నవాబు ముకర్రం జా కన్నుమూత
విదేశాలలో జన్మించి జీవితామంతా అక్కడె గడిపి, కన్నుమూసి
బంజారా హిల్స్ లో 400 ఎకరాల ప్యాలెస్ నుండి రెండు గదుల ఫ్లాట్ వరకు

సుదీర్ఘ కాలంగా విదేశాలలో నివసిస్తున్న హైద్రాబాద్ చివరి నిజాం నవాబ్ ముకర్రం జా మరణించారు. టర్కీ రాజధాని ఇస్టాన్బుల్ లో మరణించిన ఆయనున్న స్వదేశానికి తీసుకోవచ్చి మంగళవారం హైద్రాబాద్ లో అంతిమ సంస్కరాలు చేస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
​హైద్రాబాద్ సంస్ధానం భారతదేశంలో వీలినమయ్యె వరకు పరిపాలించిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనుమడయి ముకర్రం జా 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం రాజభరణాలను రద్దు చేసే వరకు 8వ నిజాం నవాబుగా కేంద్ర ప్రభుత్వం ద్వార గుర్తింపబడిన రాచకుటుంబీకుడు. నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ కు ఇద్దరు కొడుకులు కాగ ఇద్దరి పై కూడ తండ్రికు విశ్వాసం లేకపోవడంతో పెద్ద కొడుకు కుమారుడయిన ముక్రం జాను 1954లో తన వారసుడిగా ప్రకటించగా దాన్ని కేంద్ర సర్కారు గుర్తించింది. 1977లో అత్యవసర పరిస్ధితిలో సంజయ్ గాంధీతో వివాదం కారణాన జోధ్ పూర్ రాణి గాయిత్రి దేవిను అరెస్ట్ చేసిన నేపథ్యంలో దేశం విడిచి అస్ట్రేలియాకు వెళ్ళగా అతర్వాత టర్కీకు వెళ్ళి అక్కడె దాదపు జీవితమంతా గడిపారు.
తన తల్లి కారణాన జోర్డాన్, సౌదీ అరేబియా రాజకుటుంబాలతో బంధుత్వం కల్గిన ముక్రం జా డూన్ స్కూల్ లో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తో పాటు విశ్వఖ్యాత రాయల్ మిలిటరీ అకాడమీలో కూడ విద్యనభ్యసించిన ఆయన నివాసం బంజారాహిల్స్ లో 400 ఎకరాలలో ఉన్న ప్రస్తుత కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్కుగా ఉన్న చిరాన్ ప్యాలెస్. దక్షిణ టర్కీలో మధ్యధార సముద్ర తీరంలో ఒక రెండు గదుల ఫ్లాట్ లో ఆయన గడిపారు. ముంబాయిలో ముఖ్యమంత్రి అధికార నివాసం ఎదురుగా, ఫ్రాన్స్, బ్రిటన్ మరియు సౌదీ అరేబియా దేశాలలో కూడ ఆయనకు ఖరీదయిన ఆస్ధులు ఉన్నాయి.
నలుగురు భార్యలను వివాహమాడిన ముక్రం జా తన అస్ట్రేలియాకు చెందిన తన రెండవ భార్య హెలన్ విడాకుల కొరకు హైద్రాబాద్ లోని తన పూర్వీకుల అస్ధిలో పెద్ద మోత్తాన్ని విక్రయించారు. టర్కీ, మోరకో దేశాలకు చెందిన మరో ముగ్గురిను కూడ ఆయన వేర్వేరుగా వివాహాలు చేసుకోవడం జరిగింది.
హైద్రాబాద్ లోని తాజ్ ఫలక్ నూమ ప్యాలెస్ తో పాటు ఇతర ఆస్ధులన్ని కూడ ఆయన మోదటి భార్య టర్కీకు చెందిన ఎస్రా చూస్తుంటారు. కెసిఆర్ తో పాటు గతంలో పని చేసిన అనేక మంది ముఖ్యమంత్రులతో ఎస్రా సమావేశమయ్యారు.
ఫ్రాన్స్ లో సంపన్నులు నివసించె నీస్ లో జన్మించిన ఆయన టర్కీలో మరణించి అంతిమంగా తనకు తన పూర్వీకుల మాతృభూమిలోనె అంతిమ సంస్కారాలు చేయాలని కోరారు