NRI-NRT

సౌదీలో దుమ్మురేపిన సంక్రాంతి సంబరాలు

సౌదీలో దుమ్మురేపిన సంక్రాంతి సంబరాలు

మక్కా మదీన పుణ్యక్షేత్రాల కారణాన ముస్లింల ఆధ్యాత్మిక ప్రపంచంలో సౌదీ అరేబియా అగ్రభాగన ఉన్నట్లుగా దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న చమురు నిల్వల కారణాన ఆర్ధిక జగత్తులో కూడ సౌదీ అరేబియా ఒక ప్రబలమైన స్ధానం కల్గి ఉంది. దేశ పరిశ్రమలు, చమురు ఎగుమతికు నేలవైన ఈశాన్య ప్రాంతంలో భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉండగా అందులో తెలుగు ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు.

తెలుగు వారు ఎక్కడుంటే ఏమి సంక్రాంతిను మాత్రం సంతోషంగా జరుపుకొంటారు, ఇంకేమి ఈశాన్య ప్రాంతంలోని దమ్మాం మరియు జుబేల్ నగరాలలో రెండు తెలుగు ప్రవాసీ సంఘాలు వేర్వేరుగా సంక్రాంతి సంబరాలను ఆటపాటలతో అంబరాన్నంటించారు. తమ స్వంత గోదావరి జిల్లాల హంగమా రీతిలో కాకున్నా అదే జిల్లాలకు చెందిన ప్రవాసీయులు ఎడారి నాట సంక్రాంతి సంబరాలతో అందరిలో ఉత్సహాం నింపి ఉరుకలేయించారు. బతుక వచ్చిన చోటా కొత్త అల్లుళ్ళ సందడులు, బావమరదళ్ల సరసాలు లేకున్నా భోగి మంటలు, పిండి వంటలు, కొత్త బట్టల వయ్యారాలతో సంక్రాంతికి వన్నెలు తీసుకోవచ్చారు.

దమ్మాంలోని సౌదీ అరేబియా తెలుగు సమాఖ్యా (సాట్స్) సంక్రాంతి సందర్భంగా దుమ్ము రేపింది. ఈశాన్య రాజధాని దమ్మాం కేంద్రంగా పని చేసే సాట్స్ అధ్వర్యంలో శనివారం జరిగిన సంక్రాంతి కార్యక్రమం విజయవాడకు చెందిన నందమూరి రాజ్య లక్ష్మి మరియు రాజమండ్రికు చెందిన శివ అధ్వర్యంలో సంప్రదాయంగా జరిగిన భోగి మంట కణికల చుట్టు తిరుగుతూ అందరు ఆడుతూ పాడుతూ అరంభించారు. దుష్ట శక్తులను తొలగించె రంగోలి డిజైన్లను ఉమా మహేశ్వరరావు, అనితల అధ్వర్యంలో నిర్వహించగా జి.సుజాత, లక్ష్మి దేవి, బి. మహాతిలు గెలుపొందారు. సంక్రాంతి ఇతివృత్తంగా మహీ, సమీరా, ఆధ్యా మరియు వేదలు చేసిన నృత్యాలు అలరించగా చైతన్య చేసిన నృత్య విన్యాసాలు అబ్బురపరిచాయి. కె.వి.యన్.రాజు, సి. అనిత మరియు జె.బ్రహ్మరాంబల అధ్వర్యంలో దినమంతా కొనసాగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఉల్లాసపరిచాయి. సందర్భానుసారం సన్నివేశాలకు అనుగుణంగా వసంత, నివేదిత, విజయలక్ష్మి, సంజయ్, కావ్య శ్రీ, రాజులు చేసిన వ్యాఖ్యానాలతో సభా ప్రాంగణం హరివిల్లింది. చిన్నారులకు రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలతో కూడిన భోగి పళ్ళు ఇచ్చె కార్యక్రమం చూడముచ్చటగా జరిగింది. సాట్స్ (సౌదీ అరేబియా తెలుగు సమాఖ్యా) అధ్యక్షుడు చందగానీ నాగశేఖర్ నేతృత్వంలో వరప్రసాద్, కె.పాపరావు, కె.వి.యన్.రాజు, హరి కిషన్, దిలీప్, ఉమా మహేశ్వరరావులు కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

దమ్మాం, అల్ ఖోబర్, జుబేల్, అల్ హస్సా మరియు రాస్ తనురా ప్రాంతాలకు చెందిన తెలుగు కుటుంబాలు పాల్గోన్నట్లుగా సాట్స్ అధ్యక్షులు నాగశేఖర్ తెలిపారు.