Sports

ఎన్టీఆర్ నీ కలిసిన ఇండియా క్రికెట్ ప్లేయర్స్

ఎన్టీఆర్ నీ కలిసిన ఇండియా క్రికెట్ ప్లేయర్స్

ఇండియా క్రికెట్ ప్లేయర్స్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ అంతా కలిశారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రేపు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనున్న విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే భారత్ క్రికెట్ టీం హైదరాబాద్‌కు చేరుకుంది. కాగా.. ఎన్టీఆర్‌ని కలిసిన వారిలో సూర్యకుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చహల్, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు. గతంలో ఖరీదైన కార్ కలెక్షన్స్‌తో హైదరాబాద్ వాసి నజీర్ ఖాన్ ఆకట్టుకున్న విషయం తెలిసే ఉంటుంది. ఆ నజీర్ ఖాన్‌కు టీం ఇండియా ప్లేయర్స్‌లో కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. నజీర్ ద్వారా ఆయన ఇంట్లోనే ఎన్టీఆర్‌ను టీం ఇండియా ప్లేయర్స్ కలిశారు.