Devotional

TNI ఆధ్యాత్మిక వార్తలు.. అవధూత అంటే ఎవరు…

TNI ఆధ్యాత్మిక వార్తలు.. అవధూత అంటే ఎవరు…

* అవధూత అంటే ఎవరు

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు

అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు.
అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు,సన్యాసి అంటే ఎవరు, సన్యాసం అంటే ఏమిటో తెలుసుకుందాము.

సన్యాసం నాలుగు రకాలు

వైరాగ్య సన్యాసం

వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది .
ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు .
అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.

జ్ఞాన సన్యాసం

సత్ సాంగత్యం ద్వారా , లౌకిక వాంచలు తగ్గిపోయి సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ,
ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు .

జ్ఞాన వైరాగ్య సన్యాసం

సాధన ద్వారా , ధ్యానం ద్వారా
అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని
నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు .

కర్మ సన్యాసం

బ్రహ్మ చర్యము , గృహస్త , వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ , ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం .

ఈ సన్యాసులు ఆరు రకాలు

కుటిచకుడు

శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.

బహుదకుడు

ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు

హంస

ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.

పరమహంస

వెదుర దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి
నిరంతర సాధన లో ఉంటారు .

తురియాతితుడు

దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .

అవధూత

ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు .జగత్ మిధ్య నేను సత్యం అంటూ ,
నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు.
నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము,
అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి
అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ,
దొరకని రోజు ఏకాదశి దొరికిన రోజు ద్వాదశి అంటూ
రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు.

కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు …
( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం అవధూతల మరో రూపం )

* వైభవంగా గిరిప్రదక్షిణ

శ్రీకాళహస్తి: ఆది దంపతుల కల్యాణానికి సోమవారం దేవతలకు, మునులకు ఆహ్వానం పలికారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కొలువుదీరిన శివపార్వతులు కనుమ పండుగ రోజున కైలాసగిరుల ప్రదక్షిణ చేసి దేవతలను, రుషులను ఆహ్వానించారు.జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు అలంకార మండపంలో పూజలు చేశాక చప్పరాలపై అధిష్టింపజేసి కైలాసగిరి ప్రదక్షిణకు బయలు దేరారు.చతుర్మాడ పురవీధులు శివనామస్మరణతో మారుమోగగా జయరామరావువీధి, కైలాసగిరికాలనీ, రామచంద్రాపురం, రాజీవ్‌నగర్‌ ప్రాంతాల మీదుగా స్వామి అమ్మవార్లు గిరిప్రదక్షిణకు వెళ్లారు.మార్గమధ్యంలోని రామాపురం రిజర్వాయరు సమీపంలో గల అంజూరు మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పూజలు చేశారు. గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తులకు అక్కడే భోజన వసతి కల్పించారు.తరువాత స్వామి అమ్మవార్లను వెయ్యిలింగాల కోన, వేడాం, వేడాం మిట్టకండ్రిగ, తుఫానుసెంటరు మీదుగా శుకబ్రహ్మాశ్రమం వద్ద గల ఎదురు సేవ మండపం వద్దకు తీసుకువచ్చారు. భక్తులు, ఆలయ అధికారులు అక్కడ స్వామిఅమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామి అమ్మవార్లు రాత్రి పురవీధుల్లో ఊరేగారు.

null