Politics

చంద్రబాబును కలిసిన ఆస్ట్రేలియా ఎన్నారై తెదేపా బృందం

చంద్రబాబును కలిసిన ఆస్ట్రేలియా ఎన్నారై  తెదేపా బృందం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆస్ట్రేలియా, మెల్బోర్న్ కి చెందిన ఎన్నారైలు మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ నెలలో మెల్బోర్న్ లో జరుగబోయే మహానాడు మరియు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సింది గా వారు చంద్రబాబు ని కోరారు . అలానే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి పై చంద్రబాబు తో వారు చర్చించినట్లు ,తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటానికి తమ వంతు కృషి చేస్తాం అని ఎన్నారైలు చంద్రబాబు కి తెలిపారు. ఈ భేటీలో తెలుగుదేశం విక్టోరియా ప్రెసిడెంట్ దేవేంద్ర పర్వతనేని, సభ్యులు శ్రీనాధ్ కనగాల, బలుసు కిషోర్ మరియు గుంటూరు జిల్లా కి చెందిన యడ్లపల్లి వాణి
మరియు ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు