DailyDose

నెలకు 60 లక్షలు అదా అయినట్టేనా…?

నెలకు 60 లక్షలు అదా అయినట్టేనా…?

ఏడాదికి టీ, బిస్కెట్లకు రూ.8కోట్లు

ప్రభుత్వం వృథా ఖర్చులపై గవర్నర్కు ఎఫ్ జి జి లేఖ

హైదరాబాద్, . ప్రొటోకాల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చే స్తోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీ) సెక్రటరీ పద్మానాభరెడ్డి ఆరోపించారు. 2021-22 ఏడాదిలో రాష్ట్రానికి గెస్ట్లు వచ్చినప్పుడు, సెక్రటేరియెట్ తరుచూ మీటింగ్ లు నిర్వహించినప్పుడు టీ, బిస్కెట్ల కోసమే ప్రొటోకాల్ డిపార్ట్మెంట్ రూ.8 కోట్లు ఖర్చు చేస్తోందని, అంటే రోజుకు రూ.2 లక్ష లని చెప్పారు. ఈ డిపార్ట్ మెంట్ అవసరానికి మించి ఖర్చు చేస్తున్నట్లు అర్థమవుతోందని చెప్పారు. వీటిపై ఏసీబీ లేదా విజిలెన్స్ డిపా ర్ట్ మెంట్ ద్వారా విచారణ జరిపించాలని గవర్నర్ కు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ప్రొటోకాల్ డిపార్ట్మెంట్ కు వెహిక ల్స్ ఉన్నప్పటికీ వీఐపీలు వచ్చినప్పుడు కాస్ట్ లీ వెహికల్ ను రెంట్ కు తీసుకుంటున్నారని తెలిపారు