NRI-NRT

ఎన్నారై ఫ్యాన్స్ తో ” వీరయ్య ” సంబరాలు

ఎన్నారై ఫ్యాన్స్ తో ” వీరయ్య ” సంబరాలు

సంక్రాంతి సందర్బంగా జనవరి 13న ప్రారంభమైన మెగా మాస్ జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు పూనకాలు ఫుల్ లోడింగ్ ఐతే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూపించాడు ‘వాల్తెరు వీరయ్య’.
వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయల షేర్ రాబట్టుకుంది ఈ సినిమా. ఓవర్సీస్ లోనూ సినిమా భారీ కలెక్షన్స్ ను అందుకుంది. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి అమెరికాలోని అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు.
అమెరికాలోని పలు రాష్ట్రాలకు చెందిన తన అభిమానులను ఆన్ లైన్ ద్వారా కలుసుని వారితో ముచ్చటించారు. చిరంజీవి లైవ్ లో ఉన్నప్పుడే కేక్ కట్ చేసి
సెలెబ్రేషన్స్ చేసుకున్నారు ఎన్నారై అభిమానులు. మీ అభిమానం వల్లే ఇంతటి విజయం సాధ్యమైంది అంటూ చిరు ఆనందం వ్యక్తం చేశారు.
‘వాల్తెరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ వేడుకల్లో 28 నగరాల్లోని మెగా అభిమానులు పాల్గొన్నారు. మెగాస్టార్ ఆన్ లైన్ ద్వారా కలుసుకుని ఎన్నారై అభిమానులతో సెలెబ్రేట్ చేసుకోవడం ఇదే తొలిసారి. న్యూజెర్సీలోని ‘రేగల్’
మూవీ థియేటర్ కేంద్రంగా వెంకట్ రత్నకుమార్ చవ్వకుల, గోపి గుర్రం ,.శివ సింగరపు ఈ మెగా సెలెబ్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, సియాటెల్, పోర్ట్ ల్యాండ్, బే ఏరియా,
లాస్ ఏంజెల్స్, ఫీనిక్స్, డెన్వర్, చికాగో, మిన్నియాపాలిస్, సెయింట్ లూయిస్, కాన్సాస్ సిటీ, డెట్రాయిట్, కొలంబస్, అట్లాంటా, న్యూజెర్సీ, షార్లెట్, రాలీ, బోస్టన్, టొరంటో, వర్జీనియా, మాంచెస్టర్,
ఫిలడెల్ఫియా, పిట్స్బర్గ్, మేరీల్యాండ్, టొరంటో.. వంటి రాష్ట్రాలతో పాటు కెనడాకు చెందిన మెగా అభిమానులు చిరంజీవితో లైవ్ లో ముచ్చటించారు.