ScienceAndTech

ఏపీలో ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ ఆత్మహత్య.. కారణమేమిటంటే..!

ఏపీలో ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ ఆత్మహత్య.. కారణమేమిటంటే..!

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అమరా ఇంజనీరింగ్
కళాశాల చైర్మన్ అమరా వెంకటేశ్వరావు సోమవారం
పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పురుగుల మందు తాగిన ఆయన్ను.. బంధువులు వెంటనే
చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రయివేట్ వైద్యశాలకు
తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు
వైద్యులు వెల్లడించారు.

అమరా వెంకటేశ్వరరావు భార్య సుధారాణి తెలిపిన
వివరాల ప్రకారం.. 2011వ సంవత్సరం లో కెనరా బ్యా
నుండి కళాశాల తరపున రూ.13 కోట్లు
అప్పుతీసుకున్నారు. 2017 వరకు రూ.25 కోట్లను తిరి
చెల్లించామని వివరించారు. అయితే అప్పటికీ అప్పు
తీరలేదని బ్యాంకు అధికారులు కోర్టు ను ఆశ్రయిస్తే
కళాశాలలో సామగ్రిని యాజమాన్యానికి అప్పగించి
కళాశాలకు తాళం వేసుకోవచ్చని తీర్పు ఇచ్చిందన్నారు
కానీ, కెనరా బ్యాంకు అధికారులు కళాశాలలో సామగ్రిని
ఇవ్వకుండా మొత్తం సీజ్ చేశారని ఆరోపించింది.
అప్పటినుండి నరసరావుపేట, గుంటూరు, విజయవాడ
బెంగుళూరులో కెనరా బ్యాంకు బ్రాంచీ లకు వెళ్లి వివరా
తెలిపినా ఏ ఒక్క బ్యాంకు అధికారి స్పందించలేదని
వాపోయింది.
2017 నుండి ఇప్పటి వరకూ నోటీసులు పంపి మమ్మల్ని
వేధిస్తున్నారని అమరా వెంకటేశ్వరరావు భార్య అమరా
సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో ఉన్న తమ
సామగ్రి విక్రయించినా సుమారు రూ.16కోట్లు వస్తాయని
వాటితో బ్యాంకు అప్పు తీరుతుందని తెలిపింది. కానీ
బ్యాంకు అధికారులు మా మొర ఆలకించకుండా కళాశాల
ను అమ్మకానికి వేలం పెట్టారని దీంతో తన భర్త అమరా
వెంకటేశ్వరరావు మనస్తాపానికి గురై పురుగుల మందు
తాగి ఆత్మహత్యకు యత్నించారని వెల్లడించింది