DailyDose

ఆ నలుగురు కలెక్టర్ల అవినీతి బ్రతుకు బయట పెడతాం

ఆ నలుగురు కలెక్టర్ల అవినీతి బ్రతుకు బయట పెడతాం

మన్నెగూడలో జరుగుతున్న బీజేపీ వర్క్ షాప్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఓ నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్ కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. ధరణి పేరుతో ఆ నలుగురు భారీ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. వారి వ్యవహారంపై ఆధారాలు సేకరించామని, త్వరలోనే  సదరు కలెక్టర్ల బండారం బయటపెడతామని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేస్తున్న సదరు కలెక్టర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బండి మండిపడ్డారు. ప్రగతి భవన్ లో అన్ని పనులు ఆ నలుగురే చక్కబెడుతున్నారని, అలాంటి వారి వల్ల రాష్ట్రానికి, కష్టపడి పనిచేస్తున్న ఐఏఎస్ లకు చెడ్డపేరు వస్తోందని వాపోయారు