భారత్లో 4 నెలల తర్వాత అత్యధిక కరోనా కేసులు….
భారత్లో నాలుగు నెలల తర్వాత అత్యధిక కరోనా కేసులు పెరిగాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని తెలిపింది. మరోవైపు, రాజస్థాన్లో నలుగురు విదేశీ పర్యాటకులకు కొవిడ్ సోకింది
నాలుగు నెలల తరువాత భారత్లో అధిక కొవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు.. 754 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో కర్ణాటక ఒకరు మృతి చెందారు. మొత్తంగా భారత్లో 4,633 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2022 నవంబర్లో అత్యధికంగా 734 కొవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఆ తరువాత బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నమోదైన కేసులో అత్యధికమని తెలిపింది