WorldWonders

విజయవాడలో భారీగా బంగారం పట్టివేత..

విజయవాడలో భారీగా బంగారం పట్టివేత..

అక్రమంగా బంగారం తరలిస్తున్న

నలుగురిని విజయవాడలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలోకి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులను విచారిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కాగా రాష్ట్రంలో కస్టమ్స్ అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బంగారం, గంజాయి అక్రమంగా సరఫరా జరుగుతోంది. అక్రమార్కులు ఏదో రూపంలో రెచ్చిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడ మీదుగా యదేచ్చగా తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల తనిఖీల్లో గంజాయి భారీగా పట్టుబడుతోంది. కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బంగారాన్ని కూడా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.