Politics

టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై వైకాపా ఎమ్మెల్యే మాటల దాడి..

టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై వైకాపా ఎమ్మెల్యే మాటల దాడి..

“నీ వాళ్ళకు, నీ చుట్టాలకు ఒక చట్టం.. ఇతరులకో చట్టమా..?”

టీటీడీ మీ ఎస్టేట్
అనుకున్నారా..?

CMO సిఫారసును కాదంటారా..?

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా…

టీటీడీ ఈఓ ఒంటెత్తు పోకడపై
గిద్దలూరు ఎమ్యెల్యే అన్నా రాంబాబు తీవ్ర స్థాయి మండిపాటు:

తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలు, సౌకర్యాల కల్పనలో ప్రోటోకాల్ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్న ప్రస్తుత ఈఓ ,ఆయన అధికారులు
ఒంటెత్తు పోకడతో,తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ..
ఇటు టిటిడికి,అటు ప్రభుత్వ పెద్దలకు చెడ్డ పేరు తెచ్చేందుకు పని చేస్తున్నారని గిద్దలూరు ఎమ్యెల్యే అన్నా రాంబాబు టిటిడి ఈఓ ధర్మారెడ్డి పై విరుచుకుపడ్డారు.

✍🏼 సామాన్య భక్తులకు సౌకర్యాలు చేపడ్తున్నామనే వంకతో ప్రోటోకాల్ విషయంలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు.

✍🏼 సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించడాన్ని తాము స్వాగతిస్తామన్నారు.

✍🏼 ఏ నిబంధననైనా, ఏ కార్యక్రమమైనా తిరుమలలో పారదర్శకంగా జరిగితే సంతోషిస్తాం..స్వాగతిస్తామన్నారు. కానీ తిరుమలలో అలా జరగటం లేదన్నారు.

✍🏼 ప్రోటోకాల్ దర్శనాలు, సౌకర్యాల విషయంలో ఈఓ తన వారిని ఒక రకంగా,ఇతరులను ఇంకో రకంగా,అవమానకరంగా చూడటమేమిటని నిలదీశారు.
దీన్ని ఏమంటారు..? ఇది వివక్ష చూపడం కాదా..?

✍🏼 సాక్షాత్తు ఎ.పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జారీ అయిన సిఫారసును జనరల్ కేటగిరీలో వేయడమేమిటని సూటిగా ప్రశ్నించారు.

✍🏼 తన ఎదుట,తన సమక్షంలో ప్రోటోకాల్ లో ఉన్నవారి వాహనాలను వదిలేసి, అదే ప్రోటోకాల్ లో ఉన్న తమ వాహనాలను ఆపి సోదా చేయడమేమిటన్నారు.
‘ఈ రోజు ప్రోటోకాల్ లో వచ్చిన 350 మంది ఎమ్యెల్యేలు,ఎంపీ లు,మంత్రులేనా..? ఈ ఓ
అని రాంబాబు ప్రశ్నించారు.

✍🏼 ఈఓ తన చుట్టాలకు, తనకు కావాల్సిన వారికి, తనకు కావాల్సిన ఎమ్యెల్యే లకు తన ఇష్ట మొచ్చిన మర్యాదలు చేసి, ఇతరులను,ఇతర ఎమ్యెల్యేలను అగౌరవ పరుస్తారా..?

✍🏼 సామాన్య భక్తుల బూచిని చూపి ఆ ముసుగులో ఈఓ చేస్తున్నదేమిటి..? అని ప్రశ్నించారు.సామాన్య భక్తుల కోసం ఏమి చేసినా స్వాగతిస్తాం.. కానీ ఈ. ఓ గా మీరు చేస్తున్నదేమిటి..? అని నిలదీశారు.

✍🏼 గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం అంటే మీకు లెక్క లేదు.. టిటిడి బోర్డు అంటే లెక్కలేదు.

✍🏼 టిటిడి ఈఓ ఒంటెత్తు పోకడపై,ఆయన వైఖరిపై ముఖ్యమంత్రి గారి దృష్టికి, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్తాము.. అని రాంబాబు చెప్పారు.

✍🏼 రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఎంతో ప్రజాదరణ ఉంది.
మీ లాంటి అధికారుల చేష్టల వల్ల మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి చెడ్డపేరు వస్తుందన్నారు.

✍🏼 టిటిడి ఈఓ
ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి.. లేదా అందరికీ ఒకే నిబంధన పెట్టండి.

✍🏼 గౌరవ ముఖ్యమంత్రి
టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టిటిడి ఈఓ వైఖరిపై దృష్టి సారించాలని రాంబాబు విజ్ఞప్తి చేశారు.