Movies

నేను బన్నీతో మరోసారి నటించాలని వారంతా కోరుకుంటున్నారు: రకుల్ ప్రీత్

నేను బన్నీతో మరోసారి నటించాలని వారంతా కోరుకుంటున్నారు: రకుల్ ప్రీత్

అల్లు అర్జున్ (Allu Arjun), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘సరైనోడు’. ఈ చిత్రం విడుదలై 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రకుల్ సోషల్మీడియాలో పోస్ట్ పెట్టింది.

హైదరాబాద్: అల్లు అర్జున్ (Allu Arjun), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) నటించిన సినిమా ‘సరైనోడు’ (Sarrainodu). బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోషల్మీడియాలో నెటిజన్లు ఈ సినిమా విశేషాలు గుర్తుచేసుకున్నారు. రకుల్ కూడా ‘సరైనోడు’ చిత్రం షూటింగ్ నాటి సంగతుల గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్తో తనకున్న స్నేహం గురించి తెలిపింది.

“అల్లు అర్జున్ నాకు చాలా ఇష్టమైన కో స్టార్. గొప్ప

నటుడు. ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన నటుల్లో బన్నీ ముందువరుసలో ఉంటాడు. మేమిద్దరం మంచి స్నేహితులం. మేం ఎప్పుడు కలిసినా ఒకరిపై ఒకరం జోక్స్ వేసుకుని సరదాగా మాట్లాడుకుంటాం. సోషల్ మీడియాలో వచ్చే ఫన్నీ ఇమేజ్ ను చూసి నవ్వుకుంటాం. ‘సరైనోడు’ అప్పటి నుంచి మా బంధం ఇలానే కొనసాగుతోంది. అల్లు అర్జున్ తన చుట్టూ ఉండే వాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇక ‘సరైనోడు’ వచ్చి ఏడు సంవత్సరాలు అవుతున్నా.. ప్రేక్షకులు మా పాత్రలను ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. వాళ్లు మరోసారి మా కాంబినేషన్ ను తెరపై చూడాలని కోరుకుంటున్నారు. మంచి స్టోరీ ఉంటే నేను బన్నీతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ తనను ఆదరిస్తున్న అభిమానులకు రకుల్ థ్యాంక్స్ చెప్పింది. ఆ సినిమా షూటింగ్ నిన్న.. మొన్న జరిగినట్లుందని అప్పుడే 7 సంవత్సరాలు అయిందంటే నమ్మశక్యంగా లేదని పేర్కొంది.

ప్రస్తుతం ఈ అమ్మడు కమల్హాసన్ (Kamal Haasan) సరసన ‘ఇండియన్2’ (Indian 2) లో నటిస్తోంది. శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం కొంతభాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనితో పాటు మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్లలోనూ రకుల్ నటిస్తోంది.