NRI-NRT

గదిలో శవమై కనిపించిన భారతీయ దంపతులు

గదిలో శవమై కనిపించిన భారతీయ దంపతులు

కువైట్ : కువైట్‌లోని తమ నివాసంలో మలయాళీ దంపతులు శవమై కనిపించారు. పతనంతిట్టకు చెందిన సైజు సైమన్, అతని భార్య మృతి చెందారు సైమన్ నివాసముంటున్న భవనంపై నుంచి పడి శవమై కనిపించాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారు ఉంటున్న గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి తాళం వేసి ఉంది. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య శవమై కనిపించింది. ఈరోజు సాల్మియాలో ఈ ఘటన జరిగింది..సైమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని అంబులెన్స్ విభాగంలో ఉద్యోగి. కాగా వీరికి గతేడాది వివాహం జరిగింది.