Movies

బాక్సాఫీస్ వద్ద మెగా ఫైట్..

బాక్సాఫీస్ వద్ద మెగా ఫైట్..

సౌత్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో వీరిద్దరు క్రియేట్ చేసిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఒకరు తమిళ నాట, మరొకరు తెలుగునాట ఎనలేని ప్రజాభిమానం సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పోటీ పడని వీరి సినిమాలు మొదటిసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 10న విడుదల కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

అంటే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక్క రోజు వ్యవధిలోనే బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి, రజినీకాంత్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో మంచి మార్కెట్ ఉంటుంది. తాజా టాక్ ప్రకారం ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల వరకు బిజినెస్ చేయొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి మెగాస్టార్, సూపర్ స్టార్ మధ్య పోటీ బాక్సాఫీసు ఎలా ప్రభావితం చేస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో లేక, ఇద్దరూ సక్సెస్ అందుకొని సత్తా చాటుతారో చూడాలి.