Movies

పవన్ డేట్స్ ఇస్తేనే దీపావళికి రిలీజ్

పవన్ డేట్స్ ఇస్తేనే దీపావళికి రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ హిస్టోరికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. క్రిష్ ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటూనే మిగిలిన పెండింగ్ షూటింగ్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ఈ సినిమాకి సంబంధించి 20 నుంచి 25 శాతం కంటెంట్ పార్ట్ బ్యాలెన్స్ ఉందంట.

ఇక దీనిని కంప్లీట్ చేయడానికి 35 రోజుల షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. గతంలో కూడా నిర్మాత ఏఎం రత్నం ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ షూటింగ్ లో ఉన్నారు. తాజాగా పూణేలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందంట. దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కూడా జరుగుతోంది.

ఉస్తాద్ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ రెండు సినిమాలకి ఇచ్చే కాల్ షీట్స్ తక్కువ కావడంతో వేగంగా పూర్తి చేసే పనిలో పవర్ స్టార్ ఉన్నారు. దీంతో హరిహర వీరమల్లు షూటింగ్ ని హోల్డ్ లో పెట్టారు.

అయితే పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు ఇద్దరు వెయిట్ చేస్తున్నారంట. ఫైనల్ షెడ్యూల్ గ్యాప్ లేకుండా పూర్తి చేయాలని క్రిష్ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్.

ఉస్తాద్ ఓజీ కంప్లీట్ చేసాక పూర్తిస్థాయిలో హరిహరవీరమల్లుపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. పీరియాడికల్ జోనర్ లో ఇప్పటి వరకు చేయని క్యారెక్టరైజేషన్ కావడంతో పవన్ దానిపై ఎక్కువ సమయం వెచ్చించడానికి శ్రద్ధ చూపిస్తున్నారు.

ఈ కారణంగానే మూవీ ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఎట్టి పరిస్థితిలో దీపావళికి సినిమాని రిలీజ్ చేయాలని లక్ష్యంగా క్రిష్ మూవీపై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా సెప్టెంబర్ లోపు మూవీ షూటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో హరిహరవీరమల్లు కంప్లీట్ అయిపోతుందని అంచనా వేస్తున్నారు.