DailyDose

ఎన్టీఆర్​కు భారత రత్న ఇవ్వాల్సిందే

ఎన్టీఆర్​కు భారత రత్న ఇవ్వాల్సిందే

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని నందమూరి కుటుంబం, అభిమానుల తరపున డిమాండ్ చేస్తున్నానని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు, ప్రముఖ సినీ నటులు, నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు.

– హైదరాబాద్​లోని మాసబ్‌ట్యాంక్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు, ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించారు.

– రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

★ ఎన్టీఆర్​ శతజయతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతున్నాయి.

★ సికింద్రాబాద్​ పార్లమెంట్​ పరిధిలోని మాసబ్​ట్యాంక్​లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు, ఎన్టీఆర్​ శతజయంతి ఉత్సవాలకు నటుడు నందమూరి బాలకృష్ణ మఖ్య అతిథిగా హాజరయ్యారు.

★ ముందుగా ఎన్టీఆర్​ విగ్రహానికి నివాళులు అర్పించారు.

అనంతరం మాట్లాడిన ఆయన..

★ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని ఉందని పేర్కొన్నారు.

★ సామాన్యుల కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాలు కొనసాగించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

★ తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

★ సాంకేతికంగా విడిపోయినా ఏపీ, తెలంగాణ ప్రజలు అన్నదమ్ములుగా కలిసే ఉండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.

★ రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

★ ఎన్టీఆర్‌ పేరు చెప్పగానే ప్రతి తెలుగు వ్యక్తి గుండె పొగరుతో నినదిస్తోందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

★ సామాన్యుల కోసం ఎన్టీఆర్​ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు.

★ ఎందరో రాజకీయనేతలకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారని పేర్కొన్నారు.

★ మన దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారని గుర్తు చేశారు.

★ మండల వ్యవస్థ, మహిళ యూనివర్శిటీ, వెనుక బడిన సామాజిక వర్గాలు వారికి రిజర్వేషన్లు పెంచారని తెలిపారు.

★ ఇలా ఎన్టీఆర్​ తీసుకొచ్చిన పథకాలు, హైదరాబాద్​లో ఆయన హాయంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

ఎన్టీఆర్​కు భారత రత్న ఇవ్వాల్సిందే..!

★ నందమూరి తారక రామారావుకు ‘భారత రత్న’ ఇవ్వాలని నందమూరి కుటుంబం, రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల తరఫున డిమాండ్​ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, నందమూరి సుహాసినీ, సాయిబాబా, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ అరవింద్‌కుమార్ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.