Politics

నేడు ఏపీలో బీఆర్ఎస్ కొత్త కార్యాలయం ప్రారంభం…

నేడు ఏపీలో బీఆర్ఎస్ కొత్త కార్యాలయం ప్రారంభం…

బీఆర్ఎస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ విస్తరించేందుకు కీలక అడుగు వేసింది బీఆర్‌ఎస్‌ పార్టీ. నేడు గుంటూరులో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మంగళగిరి రోడ్డులోని AS కన్వెన్షన్ సెంటర్ వద్ద నేడు ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ ద‌శాబ్ది వేడులకపై సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. గత 9 ఏండ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ఉత్సవాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు హరీష్‌ రావు. జూన్‌ 2న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని, జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు.