WorldWonders

శుభకార్యాలలో చదివింపులు ఎందుకు చదివిస్తారో….

శుభకార్యాలలో చదివింపులు ఎందుకు చదివిస్తారో….

వీటిని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈడేతలు అంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కట్నాలు అంటే ఇంకొన్ని ప్రాంతాల్లో చదివింపులు అంటారు. ప్రస్తుతం చాలామంది ఏదో ఒక వస్తు రూపంలో, లేదంటే గిఫ్ట్ ల రూపంలో చదివింపులు ఇస్తున్నారు

ఏ చిన్న పంక్షన్ జరగనీ, పెద్ద శుభకార్యం జరగనీ ప్రతీ చోట చదివింపులు అనేవి చాలా కామన్.స్నేహితులు, బంధుమిత్రులందరూ శుభకార్యానికి హాజరై కట్నకానులకనేవి చదివిస్తుంటారు.కొంతమంది డబ్బు రూపంలో ఇస్తే, మరికొంత వస్తువుల రూపంలో గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఎవరి స్థాయికి తగినంతగా వారు డబ్బులో, వస్తువులో ఇస్తుంటారు. అయితే పెళ్ళిలో కానీ ఇతర ఫంక్షన్స్ లో కానీ ఈ చదివింపులు ఎందుకు ఇస్తారో చాలామందికి తెలీదు.అయితే కొంత మందికి డౌట్ అనేది ఉంటుంది. అసలు ఈ చదువింపులు ఎప్పటి నుంచి మొదలయ్యాయి. ఎందుకు శుభకార్యలలో చదువింపులు పెడుతారని, కాగా, దాని గురించి తెలుసుకుందాం.

అయితే ఈ సంప్రదాయం పూర్వకాలంలో ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే వారి బంధువులందరూ కట్నంగా చదివించేవారు. పిల్లకు సొమ్ముగా కాకుండా కన్యధాతకు ఉండేది. ఈ పెళ్లి ఖర్చులు పెళ్లి కూతురు తండ్రి భరిస్తాడు కాబట్టి అతనికి ఆసరాగా ఉంటాయని కట్నాలు చదివించే వారు.అలాగే వట్టిగనే డబ్బులు ఇస్తే గుర్తింపు ఉండదని, మేము ఇంత ఇచ్చామంటు చదివించేవారు.