Business

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 234.00 పాయింట్లు లాభపడి 61,963.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 111.00 పాయింట్ల లాభంతో 18,314.40 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.85 వద్ద కొనసాగుతుంది. ఈనాటి ట్రేడింగ్ లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.03%), విప్రో (2.50%), టీసీఎస్ (2.37%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.18%), ఇన్ఫోసిస్ (1.91%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.15%), యాక్సిస్ బ్యాంక్ (-0.79%), భారతి ఎయిర్ టెల్ (-0.50%), టాటా మోటార్స్ (-0.46%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.43%).