Politics

అవినాశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా…

అవినాశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా…

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (High Court) లో విచారణ ముగిసింది. రేపటి కోర్టు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు‌ వెకేషన్ బెంచ్‌ విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టు(Supreme Court)ను కోరిన సంగతి తెలిసిందే. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేసి తీర్పు చెప్పాలని హైకోర్టు‌ను రెండు రోజుల క్రితం ఆదేశించింది. ఆ ప్రకారం నేడు అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపి తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం సీబీఐ (CBI) విచారణను ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా చూడాలని అవినాష్ రెడ్డి కోరగా సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.

తన తల్లి ప్రస్తుతం కర్నూలు(Kurnool) లోని ప్రభుత్వ ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్నారని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అవినాష్ రెడ్డి కోరారు. అయితే, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఇప్పుడు ముందస్తు బెయిల్‌ కోసం అవినాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అవినాష్ పిటిషన్‌లో వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత (Narreddy Sunitha) ఇంప్లీడ్ అవ్వనున్నారు. అవినాష్‌కి ముందస్తు బెయిల్ ఇస్తే, కేసులో జరిగే పరిణామాలపై కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీబీఐ, సునీత తెలిపింది. ఇక రేపు 10 :30 గంటలకు ముందస్తు బెయిల్‌ పిటిషన్ పై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొని ఉంది.