Business

మార్గదర్శి కేసులో భారీగా రామోజీ ఆస్తులు అటాచ్…

మార్గదర్శి కేసులో భారీగా రామోజీ ఆస్తులు అటాచ్…

మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో భారీగా రామోజీరావు ఆస్తులను సీఐడీ అటాచ్‌ చేసింది. రూ. 793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

మార్గదర్శిలో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫోర్‌మెన్‌, ఆడిటర్‌లు కుట్రతో నేరానికి పాల్పడినట్లు సీఐడీ పేర్కొంది. మార్గదర్శి చిట్స్‌ ద్వారా సేకరించిన డబ్బును హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించింది.

‘ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచ్‌ల ద్వారా మార్గదర్శి వ్యాపారం చేస్తోంది. ఏపీలో మార్గదర్శికి సంబంధించి 1989 చిట్స్‌ గ్రూప్‌లు.. తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూప్‌లు క్రీయాశీలకంగా ఉన్నాయి. ఖాతాదారులకు వెంటనే డబ్బుఇచ్చే స్థితిలో మార్గదర్శి లేదు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి కార్యకలాపాలు. ఖాతాదారుల డబ్బును వివిధ రంగాలకు మార్గదర్శి మళ్లించింది.’ అని సీఐడీ తెలిపింది.