ఎన్నికల సంఘం సభ్యులు రెడ్డి ప్రసాద్, సీతారామ రావు, నెట్టెం ప్రసాద్, డి. కిరణ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగ్గా, మే12 న ఎన్నికల ఫలితాలను వెలువడ్డాయి. ఏకగ్రీవ ఎన్నిక ద్వారా తెలుగు కళా సమితి నూతన కార్యవర్గ కమిటీ 2023-2024 ఏర్పడింది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీ (2021-23) మే26 న కార్మెల్ పాఠశాలలో నిర్వహించిన వార్షిక మెగాఈవెంట్ “స రి గ మ ప” సందర్భంగా, అప్పగింత ప్రక్రియను నిర్వహించింది.
కార్యనిర్వాహక కమిటీ:
- అధ్యక్షులు: పొత్తూరు పార్థ సారథి
- ఉపాధ్యక్షులు: దొమ్మరాజు కృష్ణమ రాజు
- ప్రధాన కార్యదర్శి: ముద్దా సుబ్బారావు
- సంయుక్త కార్యదర్శి: శ్రీనివాస్ గుణ్ణం
- కోశాధికారి: అశ్వని కుమార్ నిమ్మగడ్డ
కార్యవర్గ సభ్యులు:
దుర్గా ప్రసాద్ గుత్తుల (అబుహలీఫా), సౌజన్య కునాల (అబుహలీఫా),దుర్గా వెంకటనాగఅప్పల గుల్లుపూడి (అబ్బాసియా/హవల్లి), ఫణీంద్ర సానబోయిన (ఫహాహీల్/మంగఫ్/అహ్మదీ),నవీన్ కుమార్ మదినేని (ఫర్వానియా/రెగ్గై/కువైట్ సిటీ)
నాగార్జున రెడ్డి కందుల (సాల్మియా):సాయి సుబ్బారావు నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ (2021-23) అవిశ్రాంత ప్రయత్నాలను నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన అభ్యర్థి పొత్తూరు పార్థ సారథి ప్రశంసించారు. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో కూడా మన తెలుగు కళా సమితి చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసిస్తూ కమిటి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.