Business

నేడు చివర్లో లాభాల్లోకి మళ్లిన స్టాక్ మార్కెట్లు…

నేడు చివర్లో లాభాల్లోకి మళ్లిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయినప్పటి నుంచి మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 62,969కి చేరుకుంది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 18,634 వద్ద స్థిరపడింది.