DailyDose

ఢిల్లీ ట్రాఫిక్ నియంత్రణకు AI వ్యవస్థ….

ఢిల్లీ ట్రాఫిక్ నియంత్రణకు AI వ్యవస్థ….

దేశ రాజధానిలో నియంత్రణకు AI ఆధారిత వ్యవస్థను ఢిల్లీ ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో భాగంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారిత ట్రాఫిక్‌ వ్యవస్థను తీసుకురానుంది. వచ్చే ఏడాది చివరినాటికి దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రూ.1400 కోట్ల ఖర్చుతో చేపడుతోన్న ఈ ప్రాజెక్టు.. వాహన రద్దీని తగ్గించడంతోపాటు వాహనాలు వేగంగా, సులువుగా కదిలేందుకు దోహదపడుతుందని దిల్లీకి చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.ముఖ్యంగా వాహనాల రద్దీ, వాటి వేగం అంశాల ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్స్ స్వయంగా నియంత్రించుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ను 2024 చివరికల్లా అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.