NRI-NRT

అమరావతికి కోటి రూపాయిల విరాళం: డా.యడ్ల హేమప్రసాద్

అమరావతికి కోటి రూపాయిల విరాళం: డా.యడ్ల హేమప్రసాద్

రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళాన్ని మేరీల్యాండ్‌కు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యులు డా. యడ్ల హేమప్రసాద్ ప్రకటించారు. మేరిల్యాండ్ లో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం, రాజధాని అభివృద్ధి చెందుతుందని ఆ దిశగా ప్రతి ప్రవాసాంధ్రుడు పనిచేయాలని కోరారు. మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు.
అమరావతికి కోటి రూపాయిల విరాళం: డా.యడ్ల హేమప్రసాద్
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ NTR పీడిత జన హృదయాల్లో నుంచి ఉద్భవించిన నిలువెత్తు చైతన్యం అని కొనియాడారు. మైనేని రాంప్రసాద్, సుబ్బరాయుడు జక్కంపూడి, జానకిరామ భోగినేని, ప్రసాద్ గనపనేని, శ్రీనాథ్ రావుల, శివ నెల్లూరి, భాను మాగులూరి, కిషోర్ కంచర్ల, ఆంధ్రాబ్యాంక్ రామ్మోహన్ రావు, ఆకర్ష్ వలివేటి, శ్రీనాథ్ కాండ్రు, శ్రీనివాస్ పైడి, రాంబాబు యలమంచిలి, సుధీర్ నిమ్మగడ్డ, హేమంత్ కాలే, వేణు గోరంట్ల, సుందర్ క్రోసూరి, సీతారాం గంది తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్ కోశారు. ప్రముఖ గాయని కల్యాణి ద్విభాష్యం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు.