Agriculture

కర్నూలులో రైతుకు దొరికిన విలువైన వజ్రం…

కర్నూలులో రైతుకు దొరికిన విలువైన వజ్రం…

కర్నూలు జిల్లాలో ఓ రైతు పంట పండింది. పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. వివరాలు.. తుగ్గలి మండలం బసనేపల్లిలో పొలం పనులు చేస్తుండగా ఓ రైతుకు వజ్రం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు.

అయితే చివరకు గుత్తికి చెందిన వ్యాపారి ఒక్కరు రూ. 2 కోట్లకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ సీజన్‌లో లభించిన అత్యంత విలువైన వజ్రంగా దీనిని చెబుతున్నారు. సాధారణంగా లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని.. కానీ రూ. 2 కోట్ల విలువైన లభించడం అరుదు అని స్థానికులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో రైతులు, స్థానికులు పొలాల్లో వజ్రాల వేటను మరింత ముమ్మరం చేశారు. ఒక్క వజ్రం దొరికితే శ్రీమంతులుగా మారుతామనే ఆశతో స్థానికులు వేట కొనసాగిస్తున్నారు.