Business

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ రోజు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే లాభాల్లోకి వెళ్లి, వెంటనే మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ చివర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 4 పాయింట్ల లాభంతో 62,793కి చేరుకుంది. నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 18,599 వద్ద స్థిరపడింది.