Devotional

అమర్‌నాథ్ యాత్రపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర…..

అమర్‌నాథ్ యాత్రపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర…..

అమర్‌నాథ్ యాత్ర.. మనదేశంలోనే పవిత్రమైన యాత్ర. ఈ యాత్ర కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. అయితే ఈ యాత్రపై ఉగ్రవాదుల కన్ను పనడిట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని యాత్రపై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నారని వివిధ వర్గాల సమాచారం. యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదులు భద్రతా బలగాలను, అమర్‌నాథ్ యాత్ర కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే అవకాశం ఉందని వివిధ వర్గాలు తెలిపాయి.

రాజౌరీ – ఫూంచ్, పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడికి అవకాశముందని అనుమానిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. దాడులకు పాల్పడుతారని భావిస్తున్న ఇద్దరు యువకుల గురించి గాలిస్తోంది. వారి ఇళ్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టింది భద్రతా సిబ్బంది. భద్రతను కట్టుదిట్టం చేశారు.