పురాణ కథల ప్రకారం పారిజాత పువ్వులను శ్రీకృష్ణుడు భూమిపైకి తెచ్చిన స్వర్గలోకపు వృక్షం. పారిజాతాన్ని సాధారణంగా రాత్రి మల్లె అని పిలుస్తారు. పారిజాతం సువాసపలు వెదజల్లే పూలు కలిగిన పొద లాంటి చెట్టు. పారిజాత పువ్వులు నారింజ కాండం మీద 7 నుండి 8 రేకులు కలిగి ఉంటాయి.
తెల్ల రేకుల మధ్య కుంకుమపువ్వు చుక్కలా ఉంటుంది. ఈ పువ్వులను అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. పారిజాత పుష్పం పగటిపూట వాడపోతుంది. రాత్రిపూట వికసిస్తుంది. పారిజాతం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పారిజాతం ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మొక్క. ఇది అపారమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. ఈ మొక్కలో యాంటీఆక్సిడెంట్, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నొప్పి నివారణ నుంచి జ్వరాన్ని తగ్గించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది.
పారిజాత గొప్ప జ్వర నివారిణి. ఇది మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా జ్వరంతో సహా వివిధ జ్వరాలను నయం చేస్తుంది. పారిజాత ఆకులు, పువ్వులు శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పుల చికిత్సలో వీటిని వినియోగిస్తారు.
నిరంతరం దగ్గు, గొంతు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లైతే పారిజాత ఆకులు, పువ్వులతో తయారు చేసిన టీ తాగవచ్చు. ఇది దగ్గు, జలుబు, బ్రోన్కైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
👉 – Please join our whatsapp channel here –