🕑 Published: April 24, 2026 at 11:31 AM CST
ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, పార్టీని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని భరత్ అన్నారు. ఎన్నారై టీడీపీ జర్మనీ ప్రెసిడెంట్ పవన్ కుర్ర, వైస్ ప్రెసిడెంట్ శివ, జనరల్ సెక్రటరీ సుమంత్ కొర్రపాటి, శ్రీకాంత్ కుడితిపూడి, దినేష్ కోవి, వంశి ఉండవల్లి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.