🕑 Published: May 10, 2026 at 06:57 PM CST
నాట్స్ సంస్థ అమెరికాలోని జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (జెట్)తో కలిసి ఉత్తర కరోలీనాలోని ర్యాలీలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుక ప్రవాసంలో ఉన్న మన సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబిస్తూ విజయవంతంగా సాగింది. వేద మంత్రోచ్చారణల మధ్య ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పూజారులు క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కళ్యాణం అంతరార్థాన్ని వివరించారు. పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేదికను అందమైన పుష్పాలతో అలంకరించారు. నాట్స్ రాలీ చాప్టర్, జెట్ క్యారీల కార్యవర్గం వేడుకను విజయవంతం చేసేందుకు కృషి చేసింది. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు నిర్వాహకులను అభినందించారు.
