Movies

విలన్ పాత్రలో…మణిరత్నంతో

aishwarya to be villain in maniratnams 2019 movie

బాలీవుడ్‌ కథానాయిక ఐశ్వర్యరాయ్‌ కొత్త సినిమాకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోతున్న సినిమాలో ఆమె నటించనున్నట్లు సమాచారం. ఇందులో ఐశ్‌ ప్రతినాయకురాలి ఛాయలున్న పాత్రలో సందడి చేయబోతున్నారట. కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా సినిమా తీయాలని మణిరత్నం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ సినిమాలో నటీనటుల ఎంపికలో ఉన్నారు. ఇందులోని ‘నందిని’ అనే పాత్ర కోసం మణిరత్నం ఐశ్వర్యను సంప్రదించినట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐశ్‌, మణిరత్నం కాంబినేషన్‌లో ‘ఇరువర్‌’, ‘గురు’, ‘రావణ్‌’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య ఇటీవల ‘ఫనేఖాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఆమె గాయనిగా సందడి చేశారు. అనిల్‌ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావు, దివ్యా దత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయం సాధించలేకపోయింది.