Politics

సుజనాకు సీబీఐ సమన్లు

cbi summons sujana chowdary

కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరికి సీబీఐ సమన్లు జారీ చేసింది. 2017లో నమోదు చేసిన ఓ కేసు విషయంలో రేపు తమ ముందు హాజరుకావాలని సీబీఐ బెంగళూరు బ్రాంచ్‌ సూచించింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు రూ.కోట్ల నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసు నమోదైంది. 2017లో ఆంధ్రాబ్యాంకును రూ.71కోట్ల మేర మోసం చేసిన కేసులో ఆయనపై గురువారం సమన్లు జారీ అయ్యాయి. ఆంధ్రా బ్యాంకును మోసం చేసిన వ్యవహారంలో తమ ముందు హాజరుకావాలని సీబీఐ సూచించింది. దీంతో రేపు మధ్యాహ్నం బెంగళూరు సీబీఐ అధికారుల ముందు సుజనా హాజరుకానున్నారు.