Movies

స్పోర్ట్స్‌, రొమాన్స్‌, కామెడీ

keerthy suresh teams with jaggu and aadhi

కథానాయిక కీర్తి సురేశ్‌ కొత్త ప్రాజెక్టు ఖరారైంది. ఈ సినిమాలో ఆమెతోపాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. వర్త్‌ ఎ షాట్‌ సంస్థ తమ తొలి సినిమాగా దీన్ని నిర్మించబోతోంది. బాలీవుడ్‌ దర్శకుడు నగేశ్‌ కుకునూర్‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చనున్నారు. స్పోర్ట్స్‌, రొమాన్స్‌, కామెడీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిసింది. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేశ్‌ తెలుగులో (నేరుగా) నటించలేదు. 2018లో తమిళంలో ఆమె నటించిన ‘సీమరాజా’, ‘స్వామి 2’, ‘పందెం కోడి 2’, ‘సర్కార్‌’ సినిమాలు విడుదలై, మంచి టాక్‌ అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె మలయాళంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేయబోతున్నారు. అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు.